నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని సావర్ గావ్ గ్రామంలో చాలా రోజులుగా రోడ్డుపై ఉన్న పైప్ లీకేజీని ఎవరూ పట్టించుకోకపోవడంతో, గత రెండు మూడు సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. నూతన గ్రామ సర్పంచ్ కపిల్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామ సర్పంచ్ సోమవారం నాడు స్పందించి ఆ పైప్ లీకేజీని పనులను మరమ్మతులు చేయించి, రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి సరిచేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా గుంతలు పడిన పైపులైనింగ్ లీకేజీ కావడం వలన నీరు చివరి వరకు రాకపోయేది. లీకేజీ పని గతంలో ఎవరు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులకు రోడ్డు వెంట వెళ్లాలంటే లీకేజీ అవుతున్న నీరు, రోడ్డుపై బురుదా నుండి వెళ్లాల్సిన దుస్థితి నెలకొని ఉండేది. నేడు సర్పంచ్ స్పందించి వెంటనే పనులు మరమ్మత్తులు చేయించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు సర్పంచ్ ని అభినందించారు.
పైప్ లైన్ లీకేజీ పనులను పూర్తి చేయించిన గ్రామ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



