- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్షించారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా జరుగుతున్న ఓసిపి బ్లాక్-1కు 500 మీటర్ల దూరంలో ఉన్న డేంజర్ జోన్ సర్వే, కాపురం ఆర్అండ్ఆర్ ప్యాకేజి మిగులు ప్లాట్స్ పై అరా తీశారు. డేంజర్ జోన్ సర్వేలో వేగం పెంచాలని తహసీల్దార్ ను ఆదేశించారు. మండలంలో అక్రమ ఇసుక, బైండోవర్స్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



