- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆధ్వర్యంలో నీట్-యూజీ 15% అఖిల భారత కోటా కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. 85% రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి మొదలవుతుంది. రెండు కోటాల్లోనూ మూడు ప్రధాన రౌండ్లు, చివరిగా మిగిలిన సీట్ల భర్తీ కోసం ‘స్ట్రే వెకెన్సీ’ రౌండ్ నిర్వహిస్తారు. విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో తొందరపడకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -



