నవతెలంగాణ – మునిపల్లి :
మండలంలోని కంకోల్ శ్రీ వీరభద్ర విద్యాలయంకు చెందిన పద్దెనిమిదిమంది విద్యార్థులు గురుకులలో ఐదవ తరగతి ప్రవేశనికి ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సంగమేశ్వర్ తెలిపారు. గత నెలలో గురుకులలో ఐదవ తరగతి ప్రవేశానికి శ్రీ వీరభద్ర విద్యాలయం నుండి పదోమ్మిది గురు విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయగా పద్దెనిమిదిమంది ఎంపికయ్యారని వారిలో సింధు, శృతి, మెదశ్రీ, అశ్విత, ప్రవళిక, సీరిచేందన మహేష్, కార్తీక్, సాకేత్, శేఖర్, హర్షవర్ధన్, అఖిలేష్, భవానిశంకర్, బసవేశ్వర్ , మనోహర్, శివ, సాయితేజ, దినకర్ లు ఉన్నారని, విద్యార్థుల విజయానికి పాఠశాల కీర్తి ప్రతిష్టకు కృషి చేసిన పాఠశాల ఉధ్యాయులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వారు అన్నారు.



