నవతెలంగాణ కాటారం
కాటారం మండలంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) విజయలక్ష్మి సందర్శించి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న లర్నర్స్తో మాట్లాడి, వారు పొందుతున్న శిక్షణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన ఈ శిక్షణ కార్యక్రమం పేదవారికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించబడిందని ఆమె పేర్కొన్నారు. అందువల్ల లర్నర్స్ అందరూ శ్రద్ధగా శిక్షణను అభ్యసించాలని సూచించారు.

అదేవిధంగా ట్రైనర్స్తో కూడా మాట్లాడి, శిక్షణ మరింత మెరుగ్గా అందే విధంగా తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏపీఎం రవీందర్ గారిని అడిగి శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్న తీరు గురించి తెలుసుకొని, శిక్షణ నాణ్యతతో పాటు వసతులు కూడా మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఫర్జానా బేగం, డిపిఎం (నాన్ ఫామ్) గోవింద్, ఎంపిడిఓ బాబు, ఏపీఎం రవీందర్, ఎంపీఓ, సీసీలు, పంచాయతి సెక్రటరీ, ట్రైనర్లు, లెర్నర్స్ పాల్గొన్నారు.



