– గోవుల కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరం గోశాల చైర్మన్ గాండ్ల సంజయ్
నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ గోశాలలో గోవుల రక్షణ కొరకు షెడ్డు నిర్మాణానికి గోశాల చైర్మన్ గాండ్ల సంజు ఆధ్వర్యంలో గురువారం నాడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని షెడ్డు నిర్మాణానికి దాతలుగా ముందుకు రావాలని కోరారు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు యువకులు గోవుల కోసం నిర్మించే షెడ్డు నిర్మాణానికి అందరం కలిసికట్టుగా దాతలను కలిసి షర్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. గోశాల షెడ్డు భూమి పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరస్ సాయిలు డాక్టర్ బండి విజయ్ మాజీ సర్పంచ్ దరాస్ సురేష్ గ్రామ ఉపసర్పంచ్ వట్నాల రమేష్ మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ వివిధ పార్టీల నాయకులు కృష్ణ పటేల్, తెప్ప తుకారాం, తమ్మేవారు అజయ్, బోస్ ప్రకాష్, మున్నూరు కాపు సంఘం నాయకులు సాయిలు, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, గల్లి పెద్దలు పెద్ద సంఖ్యలో యువకులు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు
గోశాలలో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


