- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :‘వందే మాతరం’కు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం–1971లో చేసిన సవరణతో, ‘జనగణమన’తో పాటు ‘వందే మాతరం’కూ సమాన చట్టపరమైన రక్షణ కల్పించారు. ఇకపై ‘వందే మాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
- Advertisement -



