- Advertisement -
నవతెలంగాణ-సదాశివ నగర్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి (మార్కల్ ) కల్చరల్ కమిటీ వారిచే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావం కోసం ఆయన చేసిన కృషి, సేవలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



