నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామ మహిళ సంఘ భవనాల నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ధనలక్ష్మి గ్రామ మహిళా సంఘం, వరలక్ష్మీ గ్రామ మహిళ సంఘ భవనంకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున రూ.20 లక్షలు మంజూరు చేసింది. అట్టి నిధులతో గ్రామంలో రెండు గ్రామ మహిళా సంఘ భవన నిర్మాణాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామ మహిళా సంఘ భవన నిర్మాణాలకు పూజ కార్యక్రమాలు నిర్వహించి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు, మహిళలని లక్ష్యాధికారులను చేసే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు.
కార్యక్రమంలో సర్పంచ్ బైకాన్ జమున మహేష్, మార్కెట్ కమిటీవైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మురళి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భూమేష్, పంచాయతీ కార్యదర్శి బాస నరేంధర్, ఐకెపి సీసీ పీరియా, వార్డు సభ్యులు, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు, వివోఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



