నవతెలంగాణ – మద్నూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పాలన కొనసాగడం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందడంతో ప్రజల్లో ఆనందం వెళ్లి విరుస్తోందని గోజేగావ్ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ గ్రామ సభ సర్పంచ్ భరత్ రాథోడ్ అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామసభలో సర్పంచ్ ద్వారా స్వాగత్ ఉపన్యాసం పరిచయం కార్యక్రమం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ కార్యదర్శి పథకాల అమలు గురించి ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ సమస్యలు పరిష్కారానికై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసభ ప్రత్యేక అధికారి ఆర్ ఐ శంకర్ పాల్గొన్నారు. ఈ సభలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు: గోజేగావ్ సర్పంచ్ భారత్ రాథోడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



