- Advertisement -
నవతెలంగాణ -పెద్దవూర
ఛత్రపతి శివాజీ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకామని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగా రెడ్డి శుక్రవారం శివాజీ వర్ధంతి సందర్బంగా తెలిపారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3న ఆయనవర్ధంతి వార్షికోత్సవంగా గుర్తించబడుతుంది. శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుడు, పరిపాలకుడు మరియు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు.ఆయన ధైర్యం, నాయకత్వం, దేశభక్తి మరియు ప్రజల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలిచారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. ఈ రోజు ఆయన సేవలను, త్యాగాలను స్మరించుకునే రోజు దేశవ్యాప్తంగా
ప్రజలు ఆయనకు నివాళులు అర్పించి, ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటారని తెలిపారు.
- Advertisement -


