- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ లో రేపు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి, చెవి, ముక్కు ,గొంతు సంబంధిత వ్యాధులకు ఈ క్యాంపులో ప్రత్యేక వైద్యం అందించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మంతవార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శనివారం విలేకరులకు తెలిపారు. మద్నూరు గ్రామస్థులు ప్రజలు ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ క్యాంపులో కంటి సర్జన్ డాక్టర్ సచిన్ విఠల్రావు అలాగే ఎంట్ సర్జన్ డాక్టర్ ప్రియాంక గురుజార్ పాల్గొంటారని తెలిపారు.
- Advertisement -



