- Advertisement -
బెంగళూరు : వచ్చే 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్ లక్ష్యానికి అనుగుణంగా వేదాంత పవర్ వనరుల సామర్థ్యంపై దృష్టి సారిస్తోన్నట్లు పేర్కొంది. 2025-26లో తల్వండి సాబో ప్లాంట్లో 3.61 లక్షల టన్నుల బయోమాస్ను వినియోగించగా, దేశవ్యాప్తంగా 8.75 లక్షల మొక్కలు నాటినట్లు ఆ కంపెనీ సిఇఒ రాజిందర్ సింగ్ అహుజా తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, నీటి సామర్థ్యం, వలయాకార ఆర్థిక వ్యవస్థ ద్వారా వనరుల వినియోగాన్ని తగ్గిస్తున్నామని తెలిపారు.
- Advertisement -



