- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
సమస్యల పరిష్కారానికై ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి గ్రీవెన్స్ సెల్ కి 9 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో కుమార్ తెలిపాడు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుండి వివిధ సమస్యలతో కూడిన ఫిర్యాదులు మొత్తం తొమ్మిది దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసిల్దార్ చందా నరేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



