- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని స్మశాన వాటిక, ప్రభుత్వ పాఠశాల, రోడ్డుకిరువైపులా, చెరువుగట్లపై ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, ఉప సర్పంచ్ గంగాధర్, ఎంపీఓ భీమేష్, గ్రామపంచాయతీ ఈవో జాదవ్ మాధవ్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
- Advertisement -


