- మండల అభివృద్ధి నిధుల మంజూరు
నవతెలంగాణ-మల్హర్రావు: మండల అభివృద్ధికి నేషనల్ హైవేస్ అథారిటీ అప్ ఇండియా,హైబ్రిడ్ అన్యుటి మోడ్ పథకం ద్వారా రూ.17.21 కోట్ల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంత్రిని అడుగగానే తాడిచెర్ల మానేరు నుండి కిషన్ రావు పల్లె వరకు రూ.2.19 కోట్లతో బిటి రోడ్డు,డివైడర్,సెంట్రల్ లైటింగ్, తాడిచెర్ల నుండి నాగులమ్మ క్రాస్ వరకు రోడ్డు,మల్లారం బ్రిడ్జి మరమ్మత్తు రూ. 15.02 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు.ఇందుకు మంత్రి శ్రీధర్ బాబుకు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకరావడంతో పాటు మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిబద్దతో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయాలతో దుద్దిళ్ల కుటుంబం పనిచేస్తున్నట్లుగా తెలిపారు.



