- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని.. ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సమ్మె నివారణ చర్యలను చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లను ఉంచినట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు.. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.
- Advertisement -



