- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రపంచ మానవ, వినియోగదారుల, బాలల హక్కులు సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సంస్థ గ్లోబల్ ఫౌండర్ నేరేళ్ల మల్యాద్రి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ స్టేట్ ప్రింట్ మీడియా ఇంచార్జ్ కొడిప్యాక సాయిరాం తెలిపారు. అందులో భాగంగా సోమవారం పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు వేసవి దాహాన్ని తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలిపారు.
- Advertisement -



