పది విద్యార్థులకు ఐఐటీ, నీట్‌పై ఉచిత అవగాహన తరగతులు

– పోస్టర్‌ను ఆవిష్కరించిన కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐఐటీ, నీట్‌పై ఉచిత అవగాహన తరగతులను ప్రముఖ ఐఐటీయన్లు, మెడికోలతో మెటామెండ్‌ అకాడమి నిర్వహించడం అభినందనీయమని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మెటామైండ్‌ అకాడమి చైర్మెన్‌ మనోజ్‌ కుమార్‌, డైరెక్టర్‌ గోపాల్‌తో కలిసి ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఐఐటీ, నీట్‌ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, పోటీ పరీక్షలను ఎదుర్కొని మొదటి ప్రయత్నంలోనే వాటిని సాధించడం ఎలా?అనే అంశాలపై ప్రతి ఆదివారం దోమల్‌గూడలోని మెటామైండ్‌ అకాడమిలో అవగాహన తరగతులుంటాయని మనోకుమార్‌ తెలిపారు. ఇతర వివరాలకు 9090898902, 9090898928 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Spread the love