- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
మండల స్థాయి పాఠశాలల క్రీడలను ఎంపీడీవో జయరాం నాయక్ సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి మండల కేంద్రము లోని కస్తూరిబా గాంధీ పాఠశాల మైదానంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని సూచించారు. కబడ్డీ, వాలీబాల్ ఖో ఖో పోటీల్లో పాల్గొని 14, 17 సంవత్సరాల బాల బాలికల విభాగంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ఆర్గనైజింగ్ సెక్రటరీ వినోద్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు మేరీ పుష్ప, గాయత్రి, నాగరాజు, ఖాజా, అర్చ ఈ క్రీడలకు రిఫరీలుగా వ్యవహరించారు.
- Advertisement -



