- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మండలం అడ్వాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క శుక్రవారం బోర్ వేయించారు.ఇందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి చేయునట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్,ఉపసర్పంచ్ బానోత్ రాజేందర్,వార్డు సభ్యులు దొడ్ల అనూష,అజ్మీరా కవితా-సమ్మయ్య,బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అడ్వాల రాజు,నాయకులు అజ్మీరా సారయ్య,ఇప్ప కృష్ణకర్,సుంకరి రాజేశం,నాంపల్లి సురేష్ పాల్గొన్నారు.
- Advertisement -



