– ఎగ్జిక్యూటివ్ చైర్మెన్గా టిమ్ కుక్
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం వపిల్ తన నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది. గత 15 ఏండ్లుగా కంపెనీని అత్యున్నత శిఖరాలకు చేర్చిన టిమ్ కుక్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన స్థానంలో హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టర్నెస్ను కొత్త సీఈఓగా కంపెనీ ఎంపిక చేసింది. సెప్టెంబర్ 1 నుంచి టర్నెస్ బాధ్యతలు చేపట్టనుండగా, టిమ్ కుక్ ఇకపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు. కుక్ హయాంలో ఆపిల్ షేరు విలువ సుమారు 20 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఏఐ, చిప్ తయారీ రంగాల్లో ఎన్విడియా వంటి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడమే లక్ష్యంగా ఆపిల్ ఈ మార్పులు చేపట్టింది. హార్డ్వేర్ రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న టర్నెస్ నాయకత్వంలో కంపెనీ మరింత సాంకేతిక నైపుణ్యం వైపు అడుగులు వేయనుంది. టర్నెస్తో పాటు జానీ స్రౌజీని చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్గా నియమించడం ద్వారా టెక్నాలజీ, ఏఐ విభాగాల్లో పట్టు సాధించాలని ఆపిల్ భావిస్తోంది.
ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టర్నెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



