- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని 15 గ్రామపంచాయతీల కార్యదర్శుల నూతన కమిటీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైయింది. అధ్యక్షుడుగా టి.సాయి కిరణ్, గౌరవ అధ్యక్షుడుగా సిహెచ్ మల్లిఖార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.సతీష్, ఉపాధ్యక్షుడుగా ప్రవీణ్ రాజు, కోశాధికారిగా రజిత, కార్యవర్గ సభ్యులుగా భాస్కర్ రెడ్డి, సరస్వతి, అపర్ణ, మదుకర్, రాజు, శివప్రసాద్ ఎన్నికయ్యారు. జీపీకార్యదర్శుల సమస్యలపై, హక్కులపై తమ వంతుగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన అన్ని గ్రామాల కార్యదర్శులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



