- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశానికి గ్రామ సర్పంచ్ లత శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్ తోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లత శ్రీనివాస్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంత ఇంటి కలను సహకారం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కీసరి లక్ష్మణ్, సత్యం, చంద్రం, గంగమణి, పంచాయతీ కార్యదర్శి సాగర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



