- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని టిఎస్ ఆర్టిసి యూనియన్ నాయకులు బుధవారం తెలిపారు. పట్టణ డిపో ఎదుట నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మొండి వైఖరి నశించాలని, గత రెండు సంవత్సరాల నుండి తమ సమస్యలు పరిష్కారం కాలేవని అన్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాలేదని, రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఎస్ ఆర్టిసి నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



