Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట

ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట

- Advertisement -

పునః ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
సిద్ధంగా ఉన్న పుస్తకాలు, యూనిఫామ్స్ 
నవతెలంగాణ – భూపాలపల్లి
: ఈనెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. ఈనెల12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాలోని అన్ని మండలాల ఎమ్మా ర్సీలకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాకు 1.45 లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటు లోకి వచ్చాయి. ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయనున్నారు.

జిల్లాలో 24 వేల మంది విద్యార్థులు…  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 69 ఉన్నత పాఠశాలలు, 44 ప్రాథమికోన్నత పాఠశాలలు, 319 ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలలో మొత్తం  24 వేల మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

పునః ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో పాఠశాలల పునః ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తి స్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అంద జేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 

సిద్ధంగా ఉన్న పుస్తకాలు, యూనిఫామ్స్  : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేదలను గుర్తించిన ప్రభుత్వం వారికి, పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తుంది. ఇందులో భాగంగా ప్రతి సబ్జెక్టుకు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్టులకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు పంపించారు. 24వేల మంది విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అందించనున్నారు.

విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం: ముద్దమల్ల రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాము..జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,49,133 పుస్తకాలు అవసరం ఉండగా 1,45,380 పుస్తకాలు జిల్లాకేంద్రంలోని పుస్తకాల డిపో నుండి మండలాలకు పంపించాము. ఇప్పటికే 97శాతం పుస్తకాలు చేరుకున్నాయి. పార్ట్-2లో 42 వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -