– బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన చేనేత అభయహస్తంలో భాగంగా ‘తెలంగాణ నేతన్నకు భరోసా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయిం చింది. ఏడాదికి రెండు విడతలుగా నేత, దాని అను బంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందజేయనుంది. దీంతో నాలుగు వేల మంది చేనేత కార్మికులకు లబ్దిచేకూరనుంది. తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పని చేస్తున్న నేత కార్మికులకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేలు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారు చేయబడిన యూనిక్ లోగోను జత చేస్తామని వివరించారు. తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను, నేత కార్మికుల వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చని తెలిపారు. తద్వారా చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పని చేసే కార్మికులు, ప్రీలూమ్, ఇతర పనులు డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్న కార్మికులు ఈ పథకానికి అర్హులని మంత్రి పేర్కొన్నారు. జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి ఏడాదికి రెండు విడతలుగా (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నుంచి మార్చి వరకు) నేత కార్మికునికి రూ. 9వేలు, అనుబంధ కార్మికునికి రూ. 3 వేలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేస్తే…మొత్తం ప్రోత్సాహకం చేనేత, అనుబంధ కార్మికులకు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
నేతన్నకు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES