Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మన ఊరు మనబడిని కాపాడుకుందాం ..

మన ఊరు మనబడిని కాపాడుకుందాం ..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం బుధవారం రోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీవో సంతోష్ కుమార్ ఈనెల 5 తేదీ నుండి ప్రారంభమయ్యే “బడిబాట” అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో అధిక మొత్తంలో పిల్లలను చేర్పించి అడ్మిషన్ చేయాలని సూచించారు. గ్రామాలలోని మహిళా సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ అభివృద్ధి కమిటీల సహాయంతో మన ఊరు మనబడి అనే విధంగా  బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా గత పదవ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో 2వ, 3వ ర్యాంకు సాధించిన జడ్పీహెచ్ఎస్ బెజ్జోరా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాఫిభోద్దీన్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి స్వామి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -