Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు: తహసిల్దార్

సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు: తహసిల్దార్

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
రైతుల లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు తెలిపారు. గురువారం  మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సు కు  ముఖ్య అతిథిగా హాజరై 363 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు,వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సం బంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  రెవెన్యూ ఇన్స్పెక్టర్  రామస్వామి, ఏ ఎస్ ఓ విజయ్ కుమార్, అసిస్టెంట్ సర్వేయర్ శివ, జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, టైపిస్ట్ రాజు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img