Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: ఎంఈఓ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ : దామరచర్ల : గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామస్తులు చేయూత నందించాలని దామరచర్ల మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని జైత్రం తండాలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతూ.. సామాజికంగా వెనకబడిన గిరిజన తండాలను ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనట్లయితే నిరుపేద వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే గుణాత్మకమైన విద్య అందుతుందని చెప్పారు. దీన్ని గుర్తించి గ్రామ ప్రజలు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయించాలని కోరారు. విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే బడులలో దాతలు కనీస సౌకర్యాలు సమకూర్చి దాతృత్వం చూపాలని తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించుటకు ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చిందని, అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కృష్ణ ప్రధానోపాధ్యాయులు మహ్మద్ షఫీ, విజయ్, గ్రామ పెద్దలు ధర్మనాయక్ రాము నాయక్ రవీందర్ సురేందర్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -