– ఇప్పటికే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.35వేల కోట్లు జమముందుగానే బఫర్ స్టాక్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం
– ఈ ఏడాది కూడా సాగుకు ముందుగానే భరోసా అందజేస్తాం : రైతు మహోత్సవంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సప్లయ్లో కొరత పెట్టినప్పటికీ.. రాష్ట్ర ప్రభు త్వం ఎరువులు, యూరియాకు ముందే బఫర్ స్టాక్ పెట్టుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ మార్కెట్యార్డులో శుక్రవారం జరిగిన రైతు మహౌత్సవ కార్యక్రమానికి ఎడ్ల బండిలో ఊరేగింపుగా మంత్రులు తుమ్మల, పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే మానవాళికి కావాల్సిన అన్ని పంటలు పండించాలన్నారు. రైతును బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం రైతు భరోసా కింద ఇప్పటికే రూ.35వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా సాగుకు ముందే రైతు భరోసాను అందజేస్తామన్నారు. కాగా పంట సాగు విషయంలో రైతులు మెళకువలు పాటించాలన్నారు. మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150 కిలోల యూరియా వాడుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు మన పంటలు కొనాలంటే వారు టెస్ట్ చేసినప్పుడు అది పనికి వచ్చేలా ఉండాలన్నారు. ప్రకృతి సిద్ధంగా సేంద్రీయ ఎరువులతో పండిస్తే.. ఆ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పారు. వ్యవసాయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతుల ద్వారా మెళకువలు నేర్చుకోవాలన్నారు. మన భూమికి ఏ పంట అవసరం.. ఏ పంట వేస్తే ఆదాయం అధికంగా వస్తుందని చూసిన తర్వాతే పంటలు వేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని.. అలా కాకుండా ఇతర దేశాలకూ కూరగాయలు ఎగుమతిచేసే స్థాయికి ఇక్కడి రైతులు ఎదగా లన్నారు. ఆయిల్పామ్ సాగుతో ఆర్థిక వృద్ధి సాధించవచ్చని తెలిపారు. హుస్నా బాద్కు దగ్గరలోనే నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని వచ్చే నెల్లో ప్రారంభిస్తామ న్నారు. హార్టికల్చర్, అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుందని, రైతులు వినియోగించుకోవాలని సూచించారు. నష్టం వస్తున్నా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్ఫ్లవర్, జొన్నలు, మక్కలు, పెసలు కూడా కొనుగోలు చేశామన్నారు. దీనిపై రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాజకీ యాలకతీతంగా రైతులను ఆత్మీయంగా దగ్గర పెట్టుకోవాల న్నారు. పాడి పరి శ్రమ, ఆవులు, గేదెలు, చేపలు వ్యవసాయ అనుబంధ రంగాలను రైతులు పెంచా లన్నారు. మునగ ద్వారా మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి.. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల సప్లయ్ లో కేంద్రం కొరత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES