– దేశంలో సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమం
న్యూఢిల్లీ: బిలియనీర్ ఎలన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్లింక్ మన దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబో తోంది. ఇందుకు అవసరమైన లైసెన్సును భారత ప్రభుత్వం జారీ చేసింది. లైసెన్స్ కోసం స్టార్లింక్ తొలిసారిగా మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసింది. స్టార్లింక్ దరఖాస్తును పరిశీలించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రభు త్వాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా భద్రతా కోణం నుండి పరిశీలన జరిగింద ని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలో శాట్కామ్ లైసెన్సు పొందిన మూడవ సంస్థగా స్టార్లింక్ నిలిచింది. ఇంతకుము ందే యూటెల్శాట్కు చెందిన వన్వెబ్, రిలయన్స్ జియో ఈ లైసెన్సు లు పొందాయి.
మస్క్ స్టార్లింక్కు భారత్ లైసెన్స్
- Advertisement -
- Advertisement -