- Advertisement -
సభ ముగిసింది
చప్పట్లతో మారుమ్రోగిన ప్రాంగణం
శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుంది
ప్లాస్టిక్ నవ్వులను
మోసిన కుర్చీలు
కూలివాని ఎండిపోయిన డొక్కల్లా
పడి ఉన్నాయి
ఎప్పటిలాగానే ఆచరణకెక్కని వాగ్దానాలకు
మౌనసాక్షాలుగా నిలిచిపోయాయి
ఆ మైకులు
– సబావట్ హాథిరామ్
- Advertisement -