– కారు, షాపులు ధ్వంసం
డెహ్రాడూన్: పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా హైవేపై ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఐదుగరు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే హెలికాప్టర్ రెక్కల వల్ల అక్కడే ఆగి ఉన్న కారు, రోడ్డు పక్కన ఉన్న షాపులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో జరిగింది. శనివారం బదాసు (సిర్సాయి) నుంచి కేదార్నాథ్కు వెళుతున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గుప్త్ కాశిలోని రోడ్డు మధ్యలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ)కు సమాచారం ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అయ్యింది.
హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్..
- Advertisement -
- Advertisement -