Sunday, June 8, 2025
E-PAPER
Homeజిల్లాలుమొక్కుబడి(గా)బాట..

మొక్కుబడి(గా)బాట..

- Advertisement -

కొరవడిన ప్రభుత్వ దృష్టి..
అందుబాటులో ఉంని ఎంఈఓ..
తూతూ మంత్రంగా ప్రచార కార్యక్రమం ..
నవతెలంగాణ – పరకాల : ప్రతి ఏడాది ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా బడిలో పిల్లలు చేర్పించే కార్యక్రమం చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో కనబడుటలేదు. ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే ప్రయివేట్ విద్యాసంస్థలు ఈటెక్నో, డిజీ, ఐఐటీ క్లాసెస్ వంటి ప్రచారాలతో దూసుకుపోతుంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకొని కనీసం పెయింటింగ్ కూడా నోచుకోక పోవడంతో సహజంగానే తల్లిదండ్రులు, పిల్లలు ప్రభుత్వ పాఠశాలలపై అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బడిబాట వంటి కార్యక్రమాలపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం నీరుగారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కొరవడిన ప్రభుత్వ దృష్టి.. కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ప్రయివేట్‌ పాఠశాలలకు ధీటుగా వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన, సాం కేతిక విద్యవంటి అనేక విభిన్న పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం బడిబాట కార్యక్రమంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం..అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మొక్కుబడిగానే పాల్గొనడంతో విద్యార్థుల నుంచి స్పందన కనబడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

బడిబాట కార్యక్రమంలో కానరాని ఎంఈఓ : ఈ ఈ విద్యా సంవత్సరంలో జరిగిన బడికి బాట కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి ప్రభుత్వ గైడ్ లైన్ మేరకే పని చేస్తూ క్షేత్రస్థాయిలో బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అంతగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీలను భాగస్వామ్యులను చేయడంలోనూ విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పరకాల పట్టణంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో బడిబాట కార్యక్రమం ఎప్పటిలాగే ఈసారి మొక్కుబడిగానే సాగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడ్డ వసతులు, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ఇంటింటికెళ్లి చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చే దిశగా చొ రవ చూపలేకపోయారనేది ఇటీవల చేపడుతున్న కార్యక్రమాలను చూస్తే అర్థమవుతోంది. ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ వంటి విషయాలను సవివరంగా వివరిస్తే..చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపేవారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపొందేలా చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -