ఇంగ్లాండ్లో గిల్ సేన ప్రాక్టీస్
లండన్ (ఇంగ్లాండ్) : ఐదు టెస్టుల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్కు చేరుకున్న భారత టెస్టు జట్టు సాధన షురూ చేసింది. ఇంగ్లాండ్కు చేరుకున్న తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకున్న శుభ్మన్ గిల్ సేన..ఆదివారమే ప్రాక్టీస్ మొదలెట్టింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, చీఫ్ కోచ్ గౌతం గంభీర్లు ప్రాక్టీస్ సందర్భంగా మాట్లాడుతూ కనిపించారు. పేస్ దళపతి జశ్ప్రీత్ బుమ్రా, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్లు రెగ్యులర్ కసరత్తులు చేయగా.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు ప్రాక్టీస్ సెషన్కు హాజరయ్యారు. రెగ్యులర్ వార్మప్ కసరత్తులు సహా ఫిట్నెస్పై ఫోకస్ చేస్తూ సాగిన ప్రాక్టీస్ సెషన్లో భారత క్రికెటర్లు సరికొత్త రంగుల్లో తయారు చేసిన కొత్త ప్రాక్టీస్ జెర్సీలతో కనిపించారు. నేటి నుంచి ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్లపై దృష్టి పెట్టనున్నారు.
సాధన మొదలైంది
- Advertisement -
- Advertisement -