Tuesday, June 10, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రచారకాండ కాదు, పార్లమెంటు ద్వారానే స్పందన

ప్రచారకాండ కాదు, పార్లమెంటు ద్వారానే స్పందన

- Advertisement -

‘నా నరాల్లో రక్తం కాదు, సింధూరం ప్రవహిస్తోంది’ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ప్రచార హంగామా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న తన తరహా మాటలివి. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సవాలు ముందుకొచ్చి నిల్చున్న తరుణంలో ఆయనగానీ ఆయన ప్రభుత్వంగానీ అంతకన్నా ఏం చేయగలుగుతుంది? ఈ సర్కారుకు ఎప్పుడూ ఏ సమయంలోనూ పారదర్శకత, అంతరావలోకనతో సంబంధం లేదు.
ప్రధాన మంత్రిని కేంద్ర విగ్రహంగా నిలబెట్టడం చుట్టూనే మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఆధారపడింది. ఏకీకత దౌత్యనీతిని అమలు చేయడం కన్నా ఒక విధమైన వ్యక్తి ఆరాధాన పెంచడమే పనిగా పెట్టుకుంది. విదేశాంగ విధానానికి మోడీ విగ్రహాన్ని అగ్రభాగంలో వుంచడమే ప్రధానంగా చేసుకోవడంతో సంప్రదాయకమైన విదేశాంగ విధానంలోని విజ్ఞత తలకిందు లైంది. వ్యవస్థిత దౌత్య సంప్రదాయాలు తలకిందులై పోయాయి.
లొసుగుల దాచివేత
చారిత్రకంగా భారతదేశ విదేశాంగ విధానం దాని అంతర్గత పునాదులపై ఆధారపడి రూపొందింది. సజీవమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్య విధానంతో నడిచే వైవిధ్యం, సామాజిక ఆర్థిక న్యాయాలకు కట్టుబాటు సూత్రాల దృఢత్వంపై ఆధారపడింది. ప్రపంచ దేశాలలో భారతదేశ ప్రతిష్ట పెరగడానికి ఈ సూత్రాలు గట్టి ప్రాతిపదికగా పనిచేశాయి. బహుళత్వంతో కూడిన ఒక దేశపు సమాన పౌరసత్వంపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వం భారత రిపబ్లిక్‌కు విలక్షణమైన సంకేతంగా వుంటూ వచ్చింది.
ఈ వారసత్వం దెబ్బతినిపోవడమే ఇప్పటి విషాదం. క్రమబద్ధమైన సూత్రాలపై ఆధారపడిన విదేశాంగ విధానం స్థానంలో వ్యక్తి కేంద్రకంగా వ్యక్తిగత ఇమేజి ప్రాతిపదికగా నడిచే దౌత్యనీతి ఆక్రమించింది. అయితే ఈ విధానం నిలిచేది కాదు. ప్రత్యేకించి ఇండియా వంటి దేశానికి. దశాబ్దాల పాటుసాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ స్వాతంత్ర పోరాటంతో ఈ దేశానికి అంతర్జాతీయ ప్రతిష్ట ఏర్పడింది. ఆ క్రమంలో అది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా రూపు దాల్చింది. ఈ వారసత్వం నుంచి దూరం కావడం అనేది ఆరెస్సెస్‌ డీఎన్‌ఏ లోనే వున్న లక్షణం.
పహల్గాం హత్యాకాండ నేపథ్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం ఎట్టకేలకు ‘నిఘా లొసుగులు’ వున్నాయని ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈ ఒప్పుకోలు చాలా ఆలస్యంగా అరకొరగానే జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఈ లొసుగులు ఎలాంటివో ఎంత విస్త్రుతంగా వున్నాయో మాత్రం స్పష్టీకరించలేదు.
ప్రజలకు పాత్రేదీ?
వైమానిక దళ ప్రధానాధికారి అనిల్‌ చౌహాన్‌ సింగపూర్‌లో ఒక భద్రతా సదస్సు సందర్భంగా మాట్లాడుతూ నాలుగు రోజుల ఘర్షణలో యుద్ధ విమనాల నష్టపోయామని ఒప్పుకున్నారు. అయితే అంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు. అలాంటి అసంపూర్ణ వివరణలు, వైఫల్యం లోతుపాతులు పూర్తిగా వివరించ జాలవు. ప్రస్తుత సంక్షోభం రీత్యా మోడీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన రికార్డు-మరీ ముఖ్యంగా 370వ అధికరణం రద్దు తర్వాత-ఎలా వుందో విస్మరించలేము. 370వ అధికరణం తీసిపారేయడం, విలీన ఒప్పందంతో ముడిపడిన కీలక చారిత్రక సత్యాలను తోసిపుచ్చడం భారత యూనియన్‌లో జమ్ముకాశ్మీర్‌ కలసిపోయినప్పటి వారసత్వాన్ని దెబ్బతీశాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జమ్ముకాశ్మీర్‌ ప్రజలు ప్రత్యేకించి లోయవాసుల పాత్రను వమ్ము చేశాయి.
పహల్గాం తర్వాత ఇది మరింత కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా లోయ పొడుగునా వున్న ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెల్పిన పరిస్థితులలో శక్తివంతమైన ఈ ప్రజా ఐక్యతను చాలా సానుకూల పరిణామంగా చూడవలసి వుండింది. కాని ప్రభుత్వం ఆ వాస్తవాన్ని గుర్తించడం గానీ అభినందించడం గానీ జరగలేదు. అందుకు బదులుగా కాశ్మీర్‌ ప్రజలనే ఈ దాడిలో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయి. దానివల్ల ప్రభుత్వ నిజమైన ఉద్దేశం ఏమిటో అసలైన సైద్ధాంతిక దక్పథం ఏమిటో బహిర్గతమైంది. గతంలో ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలను నిలబెట్టేవిధంగా నిష్పక్షపాత వైఖరితో వ్యవహరిస్తే దాని స్థానంలో ప్రజలనూ అటూ ఇటూ రెండుగా విభజించే విధానం తెచ్చిపెట్టారు.
అంతర్గత విధానాల ప్రకారమే..
టెర్రరిజంపై పోరాటం కేవలం సైనిక ఘర్షణగానే పరిమితం చేయడం కుదిరేపని కాదు. నిజంగా శాంతిని కోరుకుంటే విధాన స్పష్టత వుండాలి. జాతీయ సమైక్యతను పటిష్టం చేసే చర్యలలో అది ప్రతిబింబించాలి. విదేశాంగ విధానం, దౌత్యం వేర్వేరు ప్రయత్నాలు కాదు. దేశీయ విధానాల కొనసాగింపే అవీ. మతపరమైన సమీకరణ పెంచడమూ, ప్రజాస్వామిక హక్కులూ మైనార్టీల హక్కులను హరించడం గత పదకొండేళ్ల పరిణామాలు గమనిస్తే ప్రధానంగా వుంటున్న దాటవేయలేని వాస్తవం, ప్రత్యేకించి ఇప్పుడున్న పరస్పర సంబంధిత సమాచార చోదిత అంతర్జాతీయ సందర్భంలో అలా సాధ్యమయ్యేది కాదు.
పహల్గాం దాడి తర్వాత ముస్లింలపై 184 ముస్లిం వ్యతిరేక విద్వేష నేరాలు జరిగినట్టు పౌర బృందాలతో కూడిన ఒక నిజ నిర్ధారణ సంఘం నివేదించింది. మొత్తంగా ముస్లింలు ప్రత్యేకించి కాశ్మీరీలు లక్ష్యంగా ఈ నేరపూరత చర్యలు జరిగాయి. ఈ చర్యలు నిరాటంకంగా సాగుతూనే వున్నాయి.
పహల్గాం హత్యాకాండకు సంబంధించి సాధికారికమైన ఆధార పత్రాల సేకరణ, ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాద బృందాల సీమారంత కార్యకలాపాల పథకాల వివరాలు జరక్కపోవడం అంతర్జాతీయ వేదికలపై భారత వాదనలను మరింత బలహీనం చేసింది. పాకిస్తాన్‌ ఉద్దేశాల విషయంలో దేశ ప్రజలు నిజమని భావించచ్చుగాని అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించాలంటే మరింత బలమైన పారదర్శక సాక్ష్యాధారాలు కావాలి.
మాజీ సైనిక దళాల ప్రధానాధికారి జరనల్‌ మనోజ్‌ నిర్వాణే మాటల్లో అలాంటి అరుదైన ఒక స్పష్టత కనిపించింది. ”యుద్ధమేమీ కాల్పనిక కవిత కాదు. మీ బాలీవుడ్‌ సినిమాలా వుండదు. అది చాలా తీవ్రమైన వ్యవహారం. బుద్ధిహీనులు మనపై యుద్ధం రుద్దినా మనం దానిపై కేరింతలు కొట్టవలసింది లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుత చర్చలకే ప్రాధాన్యతనిస్తూ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు.
ఆలస్యంగా దౌత్యయాత్రలు
ఈ దౌత్యపరమైన ప్రయత్నాల విస్తరణలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన 59 మంది ఎంపీల బృందాలు 32 దేశాలలో పర్యటిస్తున్నాయి. విదేశాలలో పార్లమెంటు సభ్యులకు, నిపుణలకు మేధావి బృందాలకు మీడియా ప్రతినిధులకు పహల్గాం సంఘటనపై భారత ప్రభుత్వ వైఖరిని తెలియజేయడం ఈ యాత్రల లక్ష్యం. అయితే ఇలా వెళ్లిన దేశాలలో భారత్‌ ఇరుగు పొరుగు దేశం ఒకటైనా లేదు. ‘నా నరాల్లో రక్తం కాదు, సింధూరం ప్రవహిస్తోంది’ అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలతో సహా దేశంలో చెప్పుకుంటున్న దానికి ఈ దౌత్య యాత్రలు పూర్తి భిన్నమైన దిశలో నడుస్తున్నాయి. టెర్రరిస్టు వ్యతిరేక చర్యలే ఈ ప్రభుత్వ అతి గొప్ప విజయాలుగా చేస్తున్న ప్రకటనలూ ఇందుకు విరుద్ధంగానే వున్నాయి.
అయితే ఆలస్యంగా మొదలైన ఈ దౌత్య యాత్రల ప్రయత్నం ఏ మేరకు జయప్రదమవుతుందో ఇప్పటికే తేలిపోయింది. పాకిస్తాన్‌ ఐఎంఎఫ్‌ దగ్గర పది వేల కోట్ల డాలర్లు, ప్రపంచ బ్యాంకు దగ్గర నాలుగు వేల కోట్ల డాలర్లు అప్పు తెచ్చుకోవడానికి ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయింది. ఇజ్రాయిల్‌, ఆఫ్ఘనిస్థాన్‌ లోని తాలిబాన్‌ ప్రభుత్వం తప్ప మరే దేశమూ భారత వైఖరిని సమర్థించింది లేదు. వాస్తవాలను కప్పిపుచ్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం వుండదు.
ప్రజలపై పోరాటం పొరబాటు
దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని హఠాత్తుగా తిరస్కరించడంతో ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సరిహద్దులలోని నదుల నీళ్లను వాటి పైన కింద గల పరీవాహక ప్రాంతాల వినియోగ హక్కును గుర్తించడం అంతర్జాతీయ అంగీకత సూత్రం. పరస్పరం కదుర్చుకున్న ఒక ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగడం పట్ల ప్రపంచ దేశాల మద్దతు లభించడం కష్టం. ఆచరణలో చూస్తే భారత దేశానికి నదీ ప్రవాహాన్ని ఆపివుంచేందుకు అవసరమైన రిజర్వాయర్‌ సామర్థ్యం కూడా లేదు. ప్రభుత్వం నీటి ప్రవాహం వివరాలు ప్రచురించడం మానేసింది. అంటే దీనివల్ల వరదలో లేక కరువులో వస్తే పాకిస్తాన్‌ రైతులు, సామాన్య ప్రజలే అత్యధికంగా నష్టపోతారన్నమాట. వారు భారతీయులైనా పాకిస్తాన్‌ ప్రజలైనా టెర్రరిజంపై పోరాటం టెర్రరిస్టులపై జరగాలి గానీ ప్రజలపై కాదు. టెర్రరిస్టులను ఏకాకులను చేయాలి. మొత్తం ప్రజలపై పోరాటం ఎన్నటికీ సానుకూల ఫలితాలను ఇవ్వజాలదు. ఒక సమగ్రమైన సూత్రబద్ధమైన వ్యూహానికి మారుగా వ్యూహాత్మక చర్యలకు దిగడం వల్ల ప్రయోజనం లేదు.
పార్లమెంటు, ఇతర చర్యలు
సరిగ్గా ఈ కారణం వల్లనే ప్రతిపక్షాలు ఈ సంక్షోభానికి సంబంధించిన అన్ని కోణాలు చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని కోరుతున్నాయి. అలాంటి ప్రత్యేక సమావేశమే వాతావరణంలో స్పష్టత తెచ్చేందుకు సరైన వేదిక అవుతుందని 16 ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనడానికి అతుకుల బొంత పరిష్కారాలు పనికిరావు.
ప్రధాని మోడీని యుద్ధ కాలపు నేతగా చూపించే భారీ కటౌట్లు, బ్యానర్లు ఇప్పుడు కూడా దేశమంతటా దర్శనమిస్తు న్నాయి. ఈ విధంగా సాయుధ ఘర్షణను రాజకీయంగా ఉపయోగించుకోవడం గురించి ఎన్నికల సంఘంతో జరిపిన చర్చల సందర్భంలో మేము ఆందోళన వెలిబుచ్చాము. ఎన్నికల అవసరాల కోసం దేశంలో ప్రచారం చేసుకుంటే అది అంతర్జాతీమ వేదికలపై బెడిసికొట్టే ప్రమాదముంది. భారత ప్రభుత్వం యుద్ధోన్మాదంతో వ్యవహరించిందని భావించే అవకాశముంటుంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం లోగుట్టు ఏమిటనేదానిపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వుంటుంది. అది మూడో పక్షం మధ్యవర్తిత్వమే అవుతుంది. ద్వైపాక్షిక అంశాలలో బయటివారి జోక్యం వుండరాదంటూ భారతదేశం సుదీర్ఘ కాలంగా అనుసరి స్తున్న ఏకాభిప్రాయానికి ఇది పూర్తి విరుద్ధమైన చర్య అవుతుంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ఒక గట్టి ప్రయత్నం వెనువెంటనే సూటిగా ప్రారంభం కావాలి. జమ్ము కాశ్మీర్‌కు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడంతో పాటు రోజువారీ పాలన లోనూ ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలను మళ్లీ తీసుకురావాలి. ప్రస్తుత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి అర్ధవంతమైన మార్గం అదొక్కటే అవుతుంది.
(జూన్‌ 4 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -