- Advertisement -
నవతెలంగాన – హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వం వాహనదారులకు ట్రాఫిక్ ఈ-చలాన్లపై 50% రాయితీ ప్రకటించింది. 2026 మే వరకు పోలీసు శాఖలో నమోదైన చలాన్లు, 1991 నుంచి 2022 వరకు రవాణా శాఖలో నమోదైన చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తుంది. జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి మాట్లాడుతూ.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21 నుంచి జూలై 10వ తేదీలోగా రాయితీతో చలాన్లను చెల్లించవచ్చని తెలిపారు.
- Advertisement -



