Tuesday, June 10, 2025
E-PAPER
Homeఆటలుతనుశ్‌ ధనాధన్‌

తనుశ్‌ ధనాధన్‌

- Advertisement -

భారత్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌ 417/7 డిక్లేర్డ్‌
నార్తాంప్టన్‌ :
యువ ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియన్‌ (90 నాటౌట్‌, 108 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), అన్షుల్‌ కాంబోజ్‌ (51 నాటౌట్‌, 86 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీలతో మెరిశారు. బ్యాటింగ్‌ లైనప్‌లో కెఎల్‌ రాహుల్‌ (51), అభిమన్యు ఈశ్వరన్‌ (80) సహా నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42, 78 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దుల్‌ ఠాకూర్‌ (34, 47 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 268/7తో ఆలౌట్‌ ముంగిట నిలిచిన జట్టును తనుశ్‌ కొటియన్‌, అన్షుల్‌లు ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించారు. దీంతో భారత్‌-ఏ 92 ఓవర్లలో 417/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. ఇంగ్లాండ్‌ లయన్స్‌కు 439 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -