‘పెళ్లాం ఊరెళితే, ఇంద్ర’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. నటిగా తన కెరీర్లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్తోనే మళ్లీ టాలీవుడ్కు రావాలని అనుకుంటున్నానని మంగళవారం ఆమె మీడియాతో తెలిపారు. ‘శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ‘ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత మణిశర్మ ‘రూపాయి’ చిత్రంలో నటించాను. బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్లో నటించే అవకాశాలు రావడంతో ముంబై వెళ్లాను. ఆ తర్వాత ‘ఇంద్ర’ సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. మా పాప తాన్యతో తెలుగింటి సంస్కతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. దానికి మంచి స్పందన లభించింది. మా పాప తాన్యకు 16 ఏండ్లు. తన ఏజ్కు తగిన మంచి అవకాశం వస్తే సినిమా ఇండిస్టీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు. అలాగే మంచి పాత్రలొస్తే సినిమాలైనా, వెబ్సిరీస్ల్లోనైనా నటించటానికి రెడీ’ అని అన్నారు. న