- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది మరిణించారు. వీరితో పాటు, వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు.
- Advertisement -