Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంఅమిత్ షా వ్యాఖ్య‌ల‌పై జైరాం ర‌మేష్ ఫైర్

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై జైరాం ర‌మేష్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో 241మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అహ్మ‌దాబాద్ నుంచి లండన్ బ‌య‌లుదేరిన బోయింగ్ విమానం టేకాప్ అయిన కొద్ది నిమిషాల‌కే..ఎయిర్ పోర్టుకు స‌మీపంలో ఉన్న ఆస్ప‌త్రిపై ప‌డిపోయింది. దీంతో భారీ విస్పోటనం సంభ‌వించి విమానంలో ఉన్న‌వాళ్లంతా చ‌నిపోగా..రమేష్ విశ్వాస్ అనే ప్ర‌యాణికుడు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఘ‌ట‌న త‌ర్వాత విమాన ప్ర‌మాదాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. విమాన ప్ర‌మాదాలు ఎవ‌రూ ఆప‌లేర‌ని, అదేవిధంగా అందులో వున్న ప్ర‌యాణికులను ర‌క్షించ‌డం అసాధ్య‌మ‌ని చెప్పారు. తాజాగా అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిప‌డ్డారు. అత్యున్న‌త‌స్థాయిలో ఉండి అమిత్ షా నిర్ల‌క్ష్యంగా మాట్లాడార‌ని, విమాన ప్ర‌మాదాలు గాడ్ ఆప్ యాక్ట్ కాద‌ని విమ‌ర్శించారు. ముంద‌స్తు చ‌ర్య‌ల‌తో విమాన ప్ర‌మాదాల‌ను నివారించొచ్చ‌న‌ని తెలిపారు.

అందుకే విమాన ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి.. విమానయాన నియంత్రణ సంస్థలు, భద్రతా ప్రోటోకాల్‌లు, సంక్షోభ ప్రతిస్పందన వ్యవస్థలు ఉన్నాయి. హోంమంత్రి మాట‌ల ప్రకారం, విమానాల భ‌ద్ర‌త‌పై విధికి వదిలేసి ఉండాలా అని శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ఆయ‌న అమిత్ షాను ప్ర‌శ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -