Sunday, June 15, 2025
E-PAPER
Homeఖమ్మంప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

- Advertisement -

ప్రోత్సాహకాలు, ఉద్దీపనలతో ప్రయోజనాలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: తొంబైవ దశకంలో విశ్వవ్యాప్తంగా వచ్చిన ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వం తన సామాజిక భారాన్ని తగ్గించుకోవడానికి సామాజిక అభివృద్ధికి కొంత ప్రయివేటీకరణ భాగస్వామ్యాన్ని ఆహ్వానించింది. అందుకు అనుగుణంగానే అనేక రంగాల్లో ప్రయివేట్ సంస్థలకు అవకాశం కల్పించింది. అందులో భాగంగానే విద్యారంగంలో ప్రయివేట్ పాఠశాలలు ఏర్పాటు అయినవి. ఎందరో మధ్యతరగతి కుటుంబాలు, అప్పుడప్పుడే ఏర్పడిన నయా ధనిక వర్గానికి ఈ పాఠశాలలు పిల్లలు భవిష్యత్తుకు కలల ఊహలు అయ్యాయి. ప్రస్తుతం మండలంలో 10 ప్రయివేట్ పాఠశాలలు విద్యా సేవలు అందిస్తున్నాయి. అయితే పాలకులు మారినప్పుడు విధానాలు మారినట్లే ప్రజా సంక్షేమంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందుతున్నాయి. ప్రయివేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాం, బస్ చార్జీలు చెల్లించి చదివించినా ప్రభుత్వ పాఠశాలలు లాగానే ఉత్తీర్ణత శాతం ఉంటుంది.

నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు సైతం ప్రయివేట్ పాఠశాలల్లో ఉండరు..

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత దుస్తులు పాఠ్య పుస్తకాలు పుస్తకాలు నోట్ పుస్తకాలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో వర్క్ బుక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారు. విశాలమైన తరగతి గదులు క్రీడా సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో సొంతం. వేలాది రూపాయల ఫీజులు కట్టి, ప్రయివేట్ పాఠశాలలకు పంపే కంటే మన ఊరి బడిలో సకల సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించి పిల్లలను మన ఊరిలోనే చదివించుకుంటే అర్ధం పరమార్ధం ఉంటుంది. విద్యార్థి మానసిక స్థితిని అంచనా వేసి తగిన విధంగా శిక్షణను ఇచ్చే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా అన్ని పాఠశాలలకు స్వచ్ఛ మిత్ర కార్మికులను నియమించడమే కాకుండా పాఠశాల మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలాగా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. ప్రయివేట్ లో చదివించడం స్టేటస్ సింబల్ గా భావించే తల్లిదండ్రులు ఒక్కసారి ప్రభుత్వ పాఠశాల సందర్శించండి. మీ పిల్లల అభ్యసన సామర్ధ్యాలను గమనించండి. నేటి పోటీ ప్రపంచంలో పిల్లలను తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలు భావి భారత పౌరులను తయారు చేయడంలో విఫలమవుతున్నాయి. 

నిరంతరం ర్యాంకులు మార్కుల బోధన వలన సమాజం నుండి తాము నేర్చుకోవలసిన అనేక అంశాలను పిల్లల కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాలు, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒత్తిడి లేని, మానసిక ప్రశాంతతతో కూడిన ప్రభుత్వ పాఠశాలల వాతావరణం దేశ భక్తులైన భావి భారత పౌరులను తయారుచేస్తుంది. జీవితంలో ఎదురయ్యే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వ పాఠశాల నేర్పిస్తుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తును నిర్మాణం చేయవలసిన బాల్యం కొన్ని ప్రయివేట్ పాఠశాలల వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల వలె మనదేశంలో కూడా ప్రాథమిక విద్యను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోని నిర్వహిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

చదువులో ఉత్తీర్ణత, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యం – ఎంఈఓ ప్రసాదరావు

మండలంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చక్కటి నిబద్ధతతో పని చేస్తున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలలు చక్కటి అభ్యసనా సామర్ధ్యాలను  కనబరుస్తున్నాయి.  తల్లిదండ్రులు నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయులతో సంభాషిస్తూ ఉండటం వల్ల విద్యార్థులు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. అనేక జిల్లా స్థాయి ప్రతిభాపాఠవ పోటీలలో సైతం గత యేడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనేక బహుమతులు సాధించడం జరిగింది. ఒత్తిడి లేని వాతావరణంలో చక్కటి మానసిక వికాసంతో కూడిన విద్యను పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తాయి. చదువులో ఉత్తీర్ణత, సామాజికంగా ఉత్తమ పౌరులను రూపొందించడం మే ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగానే నేటి విద్యావిధానం రూపొందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -