విద్యార్థిలోకం కలిసి రావాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు
కాంగ్రెస్లో సీఎం రేవంత్ ఓ ఉద్యోగి మాత్రమేనంటూ వ్యాఖ్య
ఆయన ముందు తన కొలువును కాపాడుకోవాలంటూ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆ లక్ష్య సాధన కోసం విద్యార్థిలోకం కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేవైఎం నాయకుడు సాయినాథ్తోపాటు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు శనివారం తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత హైదరాబాద్లోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి సంస్థలోకి ఆహ్వానించారు. అనంతరం జాగృతి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారని ఆమె గుర్తు చేశారు. ఆ సమయంలో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉద్యోగి మాత్రమేనని కవిత వ్యాఖ్యానించారు. ముందు ఆయన తన కొలువును కాపాడుకోవాలంటూ హితవు పలికారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్కు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు. అలాంటి సీఎంకు తమ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలంటే రేవంతే సీఎంగా కొనసాగించాలని ఛలోక్తులు విసిరారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనీ, అవన్నీ తమ పార్టీకి కలిసొస్తున్నాయని చెప్పుకొచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి తరపున పోరాడతామని తెలిపారు. ఇదే అంశంపై ఈనెల 17న మెదక్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని కవిత వివరించారు. న
సామాజిక తెలంగాణ సాధనకు నడుంబిగిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES