- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 16న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ క్యాబినేట్ సమావేశం కానుంది. . ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చించే అవకాశం ఉంది.మరోవైపు ఈ నెలాఖరులో గా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- Advertisement -