- Advertisement -
నవతెలంగాణ-బడంగ్పేట్
సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు, ఏఐసీసీ కో ఆర్డినేటర్ విచార్ విభాగ్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డిలు శనివారం సీఎం నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. తర్వాత పుష్ప గుచ్ఛాలు అందజేసి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివద్ధికి నిధుల కేటాయించాలని కోరారు. పెండింగ్లో ఉన్న అభివద్ధి పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
- Advertisement -