Monday, June 16, 2025
E-PAPER
Homeజిల్లాలుదుబాయ్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన బషీరాబాద్ వాసులు

దుబాయ్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన బషీరాబాద్ వాసులు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : గల్ఫ్ దేశమైన దుబాయ్ పర్యటనకు వెళ్ళిన రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పలువురు బషీరాబాద్ వాసులు ఆదివారం కలిశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కూతురు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లినా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ప్రస్తుతం దుబాయ్ లోనే ఉన్న బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బోడ దేవేందర్ ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో ముచ్చటించిన ప్రశాంత్ రెడ్డి అక్కడ వారు చేస్తున్న పనులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర విషయాలను ఒక్కొక్కరిని పేరుపేరునా ఆప్యాయతతో అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. దుబాయిలో బషీరాబాద్ వాసుల్ని కలవడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన వారిలో బోడ దేవేందర్, భూమేశ్వర్, కుమార్, శ్రీధర్, శీను, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -