Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్21న కామ్రేడ్ వేముల మహేందర్ 4వ వర్ధంతి..

21న కామ్రేడ్ వేముల మహేందర్ 4వ వర్ధంతి..

- Advertisement -

వ్యవసాయ కార్మికులు, ఉపాధి, పాలకుల వైఖరి, సదస్సు 
వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
నవతెలంగాణ – భువనగిరి
: ఈనెల 21వ తేదీన వలిగొండ పట్టణంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు, అనేక కూలీ, భూ పోరాటాలు నడిపిన అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ” వ్యవసాయ కార్మికులు – ఉపాధి – పాలకుల వైఖరి ” అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో వ్యవసాయ కూలీలు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఆదివారం ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు.

 నేటికీ అనేక మంది వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు సెంట్ భూమి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా వ్యాప్తంగా సంవత్సరాలుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు నూతన పాస్ బుక్కులు లేకపోవడంతో అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్న పేదలందరికీ నూతన పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు  నేటికీ చాలామందికి లేవని ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా ఇల్లు లేని ప్రతి పేదవారికి రాజకీయాలకతీతంగా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి నర్సింహ సూచించారు. అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్  వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని నర్సింహ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -