- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఇందన్పల్లి ఎస్ఆర్ ఓ కారం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి పారేశారు. ఇళ్ల చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీటినిల్వతో ఈగలు, దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయన్నారు. ఎఫ్ ఎస్ ఓ లు ఎఫ్బి వోలు బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -