ధరూర్: గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధరూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సత్యన్న, శ్రీనివాసులు, లాజర్, టైలర్ చిన్న, తిమ్మప్ప, గోవర్ధన్, గోవింద్ తదితరులు కాంగ్రెస నాయకులు డీి.ఆర్.శ్రీధర్ అధ్వర్యంలో జెడ్పీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జీ సరిత తిరుపతయ్య, నాగర్కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఎం.పీి అభ్యర్థి మల్లు రవి సమక్షంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి ఏడాది లక్ష రూపాయల సహాయం తది తర సంక్షేమ పథకాలతో అభివద్ధి జరుగుతుందని పార్టీ మారినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్సమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, సీనియర్ నాయకులు అమరావాయి కష్ణారెడ్డి, సత్యనారాయణ, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, కష్ణమూర్తి, ధరూర్ కుర్వ శ్రీనివాసులు, ఎంటికల హన్మంతు, అల్వాల రాజశేఖర్ రెడ్డి, పెదొడ్డి రామకష్ణ తదితరులు ఉన్నారు.